సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్ర. ఆదివారం ఉదయం కన్నుమూసిన గాన కోకిల లతా మంగేష్కర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. ఆయన భావోద్వేగ ట్వీట్ చేశారు. లతా అంత్యక్రియలకు సంబంధించిన ఒక ఫొటోను ఆయన షేర్ చేశారు.
దీనితోపాటు ‘కొవిడ్-19.. నువ్వు పోతూ పోతూ ఎంత పని చేశావు. చాలా నష్టం చేశావు. మా అందరి స్వరాన్ని ఎత్తుకెళ్లిపోయావు. ఐ హేట్ యూ’ అంటూ ఆనంద్ మహీంద్ర హిందీలో ట్వీట్ చేశారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ముంబైలోని శివాజీ పార్క్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా పలువరు ప్రముఖులు హాజరై లతా మంగేష్కర్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
ఆదివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు ముగిశాయి. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆమె.. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ (శరీరంలో పలు అవయవాలు పనిచేయకపోవడంతో) కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
कोविड, जाते जाते तुमने अपना सबसे बुरा किया। हमारी आवाज चुरा ली। मुझे तुमसे नफ़रत है। pic.twitter.com/oTLsF08nXN
— anand mahindra (@anandmahindra) February 6, 2022