Anand Mahindra | ఓ తోపుడు బండి… ఆ బండి చక్రాల్లో కనీసం గాలి కూడా లేదు. దాన్ని ఓ వ్యక్తి తోసుకుంటూ వెళ్తున్నాడు. అందులో ఓ పిల్లవాడు ఓ సూట్కేసుపై కూర్చోని శ్రద్ధగా చదువుకుంటున్నాడు. చుట్టూ ట్రాఫిక్.. విపరీతమైన ధ్వని. అయినా ఆ పిల్లవాడి శ్రద్ధ ఆ పుస్తకంపైనే.. ఈ చిత్రాన్ని మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర శుక్రవారం పోస్ట్ చేశారు. ఈ సంవత్సరంలో తనకు నచ్చిన అత్యంత ఇష్టమైన ఫోటో ఇదే అంటూ పేర్కొన్నారు.
‘ఈ యేడాదిలోనే నాకు అత్యంత ఇష్టమైన ఫొటో ఇది. క్షమించండి… దీన్ని ఎవరు క్లిక్ మనిపించారో నాకు తెలియదు. ఆ ఫొటోగ్రాఫర్ నాకు తెలియదు. నా ఇన్బాక్స్లో కనిపించింది. ఓ ఆశావాదం.. కష్టపడే తత్వం.. ఇవన్నీ కనిపించాయి. మనం ఎందుకు జీవిస్తున్నామో చెప్పే దృశ్యమిది. అందరికీ పరిపూర్ణమైన నూతన సంవత్సరం దక్కాలని కోరుకుంటున్నా’ అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.