న్యూఢిల్లీ : టీమ్ వర్క్తో ముందుకెళితే ఎంతటి అద్భుతాన్నైనా ఆవిష్కరించవచ్చని అందరూ చెబుతుంటారు. ఇదే కాన్సెప్ట్ను హైలైట్ చేస్తూ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహింద్ర ఓ మోటివేషనల్ వీడియోను షేర్ చేశారు. కార్పొరేట్ దిగ్గజం షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ట్విట్టర్లో షేర్ చేసిన ఈ షార్ట్ క్లిప్లో రెండు పక్షులు కనిపిస్తున్నాయి.
Sometimes, in the middle of the week, this is what it feels like you’ve been doing in a project team. 😊 Make sure you’re all working towards the same objective… pic.twitter.com/3pFSkm95Tl
— anand mahindra (@anandmahindra) November 23, 2022
వీటిలో ఓ పక్షి లోయలో ఇసుకను బయటకు లాగుతుండగా మరో పక్షి దాన్ని వెనుకకు నెడుతుండటం కనిపించింది. టీమ్ వర్క్ ప్రాధాన్యతను ఈ వీడియో వెల్లడిస్తూ ఇది ఎంత కీలకమో వివరిస్తుంది. ప్రాజెక్టు టీమ్లో మీరేం చేస్తున్నారో అదే ఈ వీడియోలో చూస్తున్నట్టుగా అనిపించవచ్చు..ఇదే లక్ష్యంతో మీరంతా పనిచేస్తున్నారని అనుకుంటానని ఈ వీడియోకు మహింద్ర క్యాప్షన్ ఇచ్చారు.
ఆన్లైన్లో షేర్ అయినప్పటి నుంచి ఈ వీడియోకు 4 లక్షలకు పైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో యూజర్లు మహింద్ర అభిప్రాయంతో ఏకీభవించారు. మీరు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజమని ఓ యూజర్ కామెంట్ చేయగా, కొద్దినెలల కిందట మా గురువు గారు కూడా ఈ వీడియోను తనకు పంపారని మరో యూజర్ గుర్తుచేసుకున్నారు.