ముంబై : పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ ఆలోచన రేకెత్తించే వీడియోలతో పాటు ఫన్నీ వీడియోలనూ (viral video) పోస్ట్ చేస్తుంటారు. ఫోన్లో ఓ కోతి వీడియోలను చూస్తున్న క్లిప్ను కార్పొరేట్ దిగ్గజం సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడది నెట్టింట తెగ వైరలవుతోంది.
इस बेचारे को ऐसी ‘इंसानियत’ से बचाओ! pic.twitter.com/BdlH5SeNji (🙏🏽 @jagdishmitra )
— anand mahindra (@anandmahindra) April 7, 2023
ఇప్పుడు చాలా మంది తమ ఫోన్లకు ఇలానే అతుక్కుపోతున్న తీరుకు ఈ వానరం వీడియో అద్దం పడుతోంది. ఈ ఈడియోను తొలుత క్యాన్వాస్ఎం సీఈఓ జగ్దీష్ మిత్ర షేర్ చేశారు. ఈ వీడియోలో చక్కగా ముస్తాబై తన యజమాని పక్కన కూర్చుని ఫోన్లో వీడియోలను స్క్రోల్ చేస్తుండటం కనిపిస్తుంది. ఈ అమాయక ప్రాణిని ఈ హానికర అలవాటు నుంచి కాపాడండి అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. జంతువులు కూడా మొబైల్ ఫోన్లకు ఎలా అలవాటు పడుతున్నాయో అని పలువురు యూజర్లు రుసరుసలాడారు. కోతులనూ స్మార్ట్ఫోన్లు నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.
Read More