ఐస్ క్రీంను సాంబార్లో ముంచారు. అలా తింటారా ఎవరైనా.. అని ఆలోచిస్తున్నారా.? ఐస్క్రీమ్ అలా తినరు కానీ ఇడ్లీని సాంబార్తో తినొచ్చు కదా. అవును చిత్రంలో ఉన్నది ఐస్క్రీమ్లు కాదు. ఇడ్లీలు. బెంగళూరులో ఓ హోటల్లో ఇడ్లీలను ఇలా చేశారు. ఇడ్లీలను చేత్తో తాకకుండా పుల్లలతో పట్టుకొని, చట్నీ, సాంబార్లో ముంచుకొని తినాలన్నమాట. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర కూడా ఈ ఫొటోను ట్వీట్ చేశారు. ఈ సృజనాత్మక ఇడ్లీలపై అభిప్రాయాలను చెప్పాలని ఫాలోవర్లను కోరారు.