గువహటి : ట్రాన్స్జండర్లు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కాలుమోపుతున్నారు. పూర్తిగా ట్రాన్స్జండర్లు నిర్వహించే టీ స్టాల్ను గువహటి రైల్వేస్టేషన్లో భారతీయ రైల్వేలు ఏర్పాటు చేయడం పట్ల సానుకూల స్పందన లభిస్తోంది. తాజాగా రైల్వేల చొరవను కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) ప్రశంసిస్తూ న్యూ ట్రాన్స్ టీస్టాల్ ఫొటోలను ట్విట్టర్లో షేర్ చేశారు.
పారిశ్రామిక దిగ్గజం తన పోస్ట్ను రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్కు ట్యాగ్ చేశారు. మీరు చేపట్టిన ఈ చిరు ప్రయత్నం, చొరవ తన దృష్టిలో అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమమని పోస్ట్లో ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు. భారత రైల్వేలు ఏ ఒక్కరినీ విడిచిపెట్టకుండా కోట్లాది మంది ప్రయాణీకులను వారి గమ్యస్ధానాలకు చేర్చుతోందని ట్రాన్స్ టీ స్టాల్ ఫొటోలను షేర్ చేస్తూ ఆయన పేర్కొన్నారు.
ఈశాన్య భారత్ నుంచి ఇటీవల మనం ఎన్నో ప్రశంసాత్మక కార్యక్రమాలు, ఘనవిజయాలను చూస్తున్నామని ఓ యూజర్ కామెంట్ చేశారు. అయితే ఈ స్టాల్ను ట్రాన్స్ టీ స్టాల్ అని పిలవడం సరైంది కాదని పలువురు యూజర్లు రాసుకొచ్చారు. వీరిని నలుగురిలో ఒకరుగా చూడాలని ట్రాన్స్ అనడం వల్ల వీరిని అందరితో వేరుచేసినట్టేనని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇది ఓ టీస్టాల్ మాత్రమేనని మూడో జండర్తో దీనికి సంబంధం లేదని అన్నారు. థర్డ్ జండర్ అని తెలిస్తే కొందరు వారి నుంచి టీ, స్నాక్స్ తీసుకోవడానికి ముందుకు రాకపోవచ్చని పేర్కొన్నారు.
Read More :
Viral News | ఆడబిడ్డను కన్న కోడలికి పూల తివాచీతో స్వాగతం.. పాప పాదముద్రలు తీసుకొని సంబురాలు