ముంబై: ఇండియన్ నేవీకి చెందిన అడ్వాన్సుడ్ లైట్ హెలిక్యాప్టర్ (ALH)కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజువారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఇవాళ ఉదయం ముగ్గురు సిబ్బందితో బయలుదేరిన ALH.. ముంబై తీరానికి సమీపంలో ప్రమాదవశాత్తు అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. నేవీకి చెందిన పెట్రోలింగ్ క్రాఫ్ట్ ఆ హెలిక్యాప్టర్లోని ముగ్గురు సిబ్బందిని రక్షించింది.
‘రోజువారీ గస్తీ నిర్వహణలో భాగంగా ఇవాళ ఉదయం కూడా అడ్వాన్సుడ్ లైట్ హెలిక్యాప్టర్ (ALH) నేవీ బేస్ నుంచి బయలుదేరింది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ హెలిక్యాప్టర్ అత్యవసరంగా ముంబై తీరంలో ల్యాండయ్యింది. అనంతరం తమ పెట్రోలింగ్ క్రాఫ్ట్ హెలిక్యాప్టర్ను గుర్తించి అందులోని ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చింది’ అని ఇండియన్ నేవీ ట్విటర్లో ప్రకటించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపనున్నట్లు తెలిపింది.