న్యూఢిలీ: దేశంలో సర్వసాధారణంగా సంభవించే మరణాల్లో రెండో ప్రధాన కారణం బ్రెయిన్ స్ట్రోక్ అని, దేశంలో ఈ వ్యాధి ప్రతి 4 నిమిషాలకు ఒకరిని చంపుతున్నదని ఎయిమ్స్ ప్రొఫెసర్ పద్మ శ్రీవాస్తవ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ ప్రభావం యువత, మధ్య వయస్కుల మీద ఎక్కువగా ఉన్నదని చెప్పారు.
జీబీడీ గణాంకాల ప్రకారం 31 శాతం బ్రెయిన్ స్ట్రోక్లు 20 ఏండ్ల లోపు వారిలో సంభవిస్తున్నాయని వివరించారు. అయితే చాలా దవాఖానాల్లో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స అందించే మౌలిక సదుపాయాలు లేవని తెలిపారు.