కోల్కతా: రీల్స్ చేయడానికి ఐఫోన్ కొనేందుకు డబ్బుల్లేక ఏకంగా తమ 8 నెలల పసికందును తల్లిదండ్రులు అమ్మేసిన ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన జయదేవ్, సతి దంపతులకు 7 ఏండ్ల కుమార్తె, 8 నెలల కుమారుడు సంతానం.
ఫోన్ కొనేందుకు డబ్బుల కోసం ఖర్దా ప్రాంతానికి చెందిన మహిళకు దంపతులు పసికందును అమ్ముకున్నారు. బాబు కనపడపోవడంతో వారిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఖర్దా ప్రాంతానికి చెందిన మహిళ నుంచి పసికందును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.