న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.5గా నమోదైంది. ఇవాళ రాత్రి 9.30 గంటలకు న్యూఢిల్లీకి దక్షిణం వైపున 8 కిలోమీటర్ల దూరంలో భూకంపం చోటుచేసుకుందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు.
భూకంప కేంద్రం నేలకు 5 కిలోమీటర్ల దూరంలో నమోదైందని చెప్పారు. అయితే జనావాసాలకు దూరంగా భూమి కంపించడంతో నగరంలో దీని ప్రభావం పెద్దగా కనిపించలేదని తెలిపారు.