న్యూఢిల్లీ: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఓ దళిత యువతి (20)పై కొంతమంది సామూహిక లైంగికదాడి జరిపి, అనంతరం ఆమెను హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ముగ్గురు నిందితుల్లో, ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారని బికనీర్ పోలీసులు బుధవారం వెల్లడించారు.
ఖాజూవాలా ప్రాంతంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా అందర్నీ కలిచివేసింది. బాధిత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగితేగానీ సీఎం అశోక్ గెహ్లాట్ సర్కార్ చర్యలు చేపట్టకపోవటం విమర్శలకు దారితీసింది. ఇద్దరు కానిస్టేబుల్స్ను సస్పెండ్ చేశామని ఐజీ ఓం ప్రకాశ్ చెప్పారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని, వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశామని బికనీర్ జిల్లా ఎస్పీ తెలిపారు.