బెంగళూరు : బెంగళూరులో పట్టపగలు దారుణం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీ మాజీ ఉద్యోగి సంస్థలోకి ప్రవేశించి అందరూ చూస్తుండగా కంపెనీ ఎండీ, సీఈవోను దారుణంగా నరికి హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..ఎయిరోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి ఫెలిక్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
కంపెనీ ఎండీ ఫణీంద్ర సుబ్రమణ్య, సీఈవో విను కుమార్లను కత్తితో తీవ్రంగా గాయపరిచాడు. వారిని వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. వ్యాపారంలో ఏర్పడిన పోటీయే ఈ హత్యలకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.