గురుగ్రామ్: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఓ వ్యక్తి.. నటిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి మోసం చేశాడు. ఇంటర్వ్యూ పేరుతో హోటల్కు పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పైగా విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దాంతో భయపడిపోయిన నటి పోలీసులను ఆశ్రయించింది. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ సిటీలో ఈ దారుణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ యువతి భోజ్పురి సినిమాల్లో నటిస్తున్నది. ఇటీవల ఆమెకు ఇన్స్టాగ్రామ్లో మహేశ్ పాండే అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో భోజ్పురి సినీ పరిశ్రమలో తనకు పరిచయాలున్నాయని, తాను అవకాశాలు కల్పిస్తానని నటిని నమ్మించాడు. ఈ క్రమంలో ఓ రోజు ఇంటర్వ్యూ పేరుతో గురుగ్రామ్లోని ఓ హోటల్కు పిలిపించాడు.
మహేశ్ పాండే మాటలు నమ్మి హోటల్కు వెళ్లిన యువతిపై అతడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం బయటికి చెబితే చంపేస్తానని బెదిరించి వదిలేశాడు. ఘటనపై నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు గురుగ్రామ్లోని చక్కార్పూర్ ఏరియాకు చెందిన వాడిగా గుర్తించారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.