చెన్నై: గుజరాత్కు చెందిన అముల్(Amul) సంస్థ.. తమిళనాడుకు చెందిన అవిన్(Aavin) డైయిరీ సంస్థ నుంచి పాలను సేకరిస్తున్నది. అయితే రాష్ట్రానికి చెందిన అవిన్ నుంచి పాలను ప్రొక్యూర్(Milk Procure) చేయడం ఆపేయాలని అముల్ సంస్థను సీఎం స్టాలిన్ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ట్విట్టర్లో ఇవాళ స్టాలిన్ దానికి సంబంధించిన ఓ పోస్టు చేశారు.
కైరా జిల్లా సహకార పాల ఉత్పత్తుల సంఘం(అముల్) తమ వద్ద ఉన్న మల్టీ స్టేట్ లైసెన్స్తో కృష్ణగిరి జిల్లాలో ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేసిందని, అయితే దాని వల్ల కృష్ణగిరి, ధర్మపురి, వెల్లోర్, రాణిపేట, తిరుపత్తూర్, కంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో రైతుల నుంచి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల నుంచి పాలను ప్రొక్యూర్ చేస్తున్నారని, ఆ ప్రక్రియను ఆపేయాలని సీఎం స్టాలిన్ తన లేఖలో మంత్రి అమిత్ షాను కోరారు.
The decision of AMUL to operate in Tamil Nadu is unfortunate, detrimental to the interest of Aavin and will create unhealthy competition between the cooperatives.
Regional cooperatives have been the bedrock of dairy development in the states and are better placed to engage and… pic.twitter.com/yn2pKINofO
— M.K.Stalin (@mkstalin) May 25, 2023
ఒక సహకారం సంఘంపై మరో సహకార సంఘం ఆధారపడరాదు అని, ఇండియాలో ఉన్న ఆ విధానాన్ని పాటించాలని అముల్ సంస్థను స్టాలిన్ కోరారు. అక్రమ రీతిలో పాలను ప్రొక్యూర్ చేయడం వల్ల అది ఆపరేషన్ వైట్ ఫ్లడ్ స్పూర్తికి విగాతం కలిగించినట్లు అవుతుందని అన్నారు. అవిన్ డెయిరీ సంస్థకు పాలను సరఫరా చేసేవారిపై అముల్ ఆధారపడడం వల్ల అది సహకార స్పూర్తిని దెబ్బతీస్తుందని స్టాలిన్ తెలిపారు.
అముల్ అనుసరిస్తున్న విధానాల వల్ల పాలు సేకరిస్తున్న సహకార సంఘాల్లో పోటీతత్వం అనారోగ్యకరంగా మారుతుందని స్టాలిన్ తెలిపారు. తక్షణమే అముల్ సంస్థ పాల సేకరణ నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ తన లేఖలో అమిత్ షాను కోరారు.