కురుక్షేత్ర: వేలాది మంది పోలీసులను గత ఆరు రోజులుగా ముప్పు తిప్పలు పెడుతూ తప్పించుకు తిరుగుతున్న ఖలిస్థాన్ మద్దతుదారుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ బ్రిటన్ పౌరసత్వం కోసం ప్రయత్నిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిక్కు వర్గం విశ్వాసాన్ని కోల్పోయినందున, భారత్ నుంచి పారిపోయి యూకేలో తలదాచుకోవడం ఉత్తమమని అతను భావిస్తున్నాడు. అతని భార్య కిరణ్ కౌర్ బ్రిటన్ పౌరురాలు కావడంతో, దానిని ఆధారంగా చేసుకుని అమృత్పాల్ సింగ్ ఫిబ్రవరిలోనే ఆ దేశ పౌరసత్వానికి దరఖాస్తు చేశాడు. అయితే అతని దరఖాస్తు బ్రిటీష్ అధికారుల వద్ద పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది.
పరారీలో ఉన్న అమృత్పాల్ హర్యానా వీధుల్లో నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. కురుక్షేత్రలోని షహబాద్ ప్రాంతంలో అమృత్పాల్ సింగ్ గొడుగు చాటున ముఖం దాచుకుంటూ వెళ్లడం రికాైర్డెంది.