బెంగుళూరు : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా చీఫ్ ఆకార్ పటేల్ను .. ఇవాళ బెంగుళూరు విమానాశ్రయంలో అడ్డుకున్నారు. సీబీఐ లుకౌట్ నోటీసులు జారీ చేసిందని, అందుకే తనను అడ్డుకుంటున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారన్నారు. మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇండియా చైయిర్గా ఉన్న ఆకార్ పటేల్ పై గతంలో సీబీఐ సోదాలు చేసింది. 2019లో బెంగుళూరు, న్యూఢిల్లీలో ఉన్న ఇండ్లలో దాడులు చేసింది. అమెరికా పర్యటన కోసం కోర్టు ద్వారా పాస్పోర్ట్ పొందినా సీబీఐ తనను అడ్డుకున్నట్లు ఆయన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. 36 కోట్ల విదేశీ నిధులను అక్రమ రీతిలో పొందినట్లు నమోదు అయిన కేసులో లుకౌట్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ కోర్టు రేపు ఈ కేసులో విచారణ చేపట్టనున్నది.