లక్నో: ఒక ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించగా, 65 మంది అస్వస్థతకు గురయ్యారు. ఉత్తర ప్రదేశ్లోని అలీగఢ్ జిల్లాలో హాజీ జహీర్కు చెందిన అల్-దువా మాంసం ఫ్యాక్టరీలో గురువారం ఈ సంఘటన జరిగింది. అస్వస్థతకు గురైన కార్మికులను జేఎన్ మెడికల్ కాలేజీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆ మాంసం ఫ్యాక్టరీలో అమోనియా గ్యాస్ లీకేజీ ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ మాంసం ఫ్యాక్టరీ వద్దకు వెళ్లారు. అందులో పని చేసే కార్మికులందరినీ ఫ్యాక్టరీ నుంచి ఖాళీ చేయించినట్లు ఒక పోలీస్ అధికారి తెలిపారు. అనారోగ్యానికి గురైన వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఒక మహిళ చనిపోయిందని, 65 మంది అస్వస్థతకు గురైనట్లు వివరించారు. ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీలో సాధారణ పరిస్థితి నెలకొన్నదని వెల్లడించారు.
మరోవైపు అమోనియా గ్యాస్ లీకేజీ వల్ల అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్ల నుంచి కొందరు వ్యక్తులు తమ భుజాలపై మోసుకుని ఆసుపత్రి లోపలకు తీసుకెళ్లిన దృశ్యాలు టీవీ ఛానెల్స్లో కనిపించాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
पुलिस एवं प्रशासनिक अधिकारियों द्वारा राहत कार्य प्रचलित है, उपरोक्त सम्बन्ध में जिलाधिकारी अलीगढ़ की बाइट pic.twitter.com/zMbS7dpRkn
— ALIGARH POLICE (@aligarhpolice) September 29, 2022