న్యూఢిల్లీ, మార్చి 25 : అగ్నివీరుల పునరావాసం కోసం వారికి 20 శాతం ఉద్యోగాలను కేటాయించాలని అన్ని రాష్ర్టాలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేఖలు రాశారు. అగ్నివీర్ల మొదటి బ్యాచ్ పదవీ కాలం 2027తో ముగుస్తుందని బుధవారం రాష్ర్టాల సీఎంలకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
పోలీస్ కానిస్టేబుళ్లు, ఫారెస్ట్ గార్డులు, ఫైర్మెన్లు, జైలు వార్డెన్లు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందంలో అగ్నివీర్లకు 20 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్రం కోరింది. అగ్నివీర్లకు రిజర్వేషన్లు అమలు చేసిన తొలి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. ఈ రాష్ట్రం ఇప్పటికే పోలీస్, మైనింగ్ గార్డులు, జైల్ వార్డెన్లు, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల నియామకంలో వీరికి రిజర్వేషన్లు ప్రకటించింది.