భీంపూర్, మే 25: పది నెలల బాబు కరోనాను జయించాడు. దాతల ఆర్థికసాయం, ఎమ్మెల్సీ కవిత చొరవతో మెరుగైన వైద్యం అందడంతో కోలుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా తాంసికి చెందిన ఇప్ప సంతోష్, పౌర్ణి మల కుమారుడు శ్రీయాష్. సంతోష్ భీంపూ ర్ మండల పరిషత్ కార్యాలయంలో తాత్కాలిక కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల వీరికి కరోనా రాగా.. చికిత్సపొంది కోలుకున్నారు. తరువాత వీరి పదినెలల బాబు శ్రీయాష్కు పాజిటివ్ వచ్చింది. ఎంత కీ తగ్గకపోవడంతో ఏప్రిల్ 24న హైదరాబాద్లోని కిమ్స్లో చేర్చారు. చేతిలో డబ్బు లేకపోవడంతో సంతోష్ ఆందోళనకు గురయ్యా డు. వాట్సాప్లో తన మిత్రులకు పరిస్థితిని వివరించాడు. ఇది వైరల్ కావడంతో 3వేల మంది దాతల సాయంతో రూ.35 లక్షల వరకు సమకూరాయి. ఇదే సమయంలో తనకు అందిన ట్వీట్ విజ్ఞాపనతో స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. వెంటనే కిమ్స్ వైద్యులతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందేలా చొరవ తీసుకున్నారు. సంతోష్ దంపతులకు ఫోన్ చేసి.. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చి, ధైర్యం చెప్పారు. బాబు మంగళవారం కోలుకోగా వైద్యులు తల్లిదండ్రులను ఐసీయూలోకి అనుమతించారు. నాలుగు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నా రు. సహకరించిన దాతలకు, ఎమ్మెల్సీ కవిత కు, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.