జైపూర్ : కాంగ్రెస్ పార్టీ, రాజస్ధాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం (Rajasthan Polls) బీసీల వ్యతిరేకని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అళ్వార్ జిల్లా ఖైర్తాల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్పై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఓట్ల కోసం కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ బీసీల వ్యతిరేక వైఖరిని అవలంభిస్తూ మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించిందని మండిపడ్డారు. బీసీ కమిషన్కు కాంగ్రెస్ చట్టబద్ధత కల్పించలేదని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని ప్రభుత్వం బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించిందని గుర్తుచేశారు. కేంద్ర క్యాబినెట్లో 27 మంది ఓబీసీ మంత్రులున్నారని, విద్యాసంస్ధల్లోనూ బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు.
రాజస్ధాన్లో అధికారం నిలుపుకునేందుకు కాంగ్రెస్ చెమటోడుస్తుండగా, ప్రభుత్వ వ్యతిరేకత ఆసరాగా అందలం అందుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇక రాజస్ధాన్లో ఈనెల 25న పోలింగ్ జరగనుండగా 23 సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
Shah Rukh Khan | Hyundai ఈవెంట్లో షారుఖ్ఖాన్ సందడి.. ట్రెండింగ్లో వీడియో