చండీగఢ్: ఇటీవల అల్లర్లు జరిగిన హర్యానాలోని నూహ్లోకి ప్రవేశించేందుకు ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు చెందిన హిందూ ధర్మకర్త జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ ప్రయత్నించారు. వీహెచ్పీ సోమవారం నూహ్లో తలపెట్టిన శోభాయాత్ర (Shobha Yatra)లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. అయితే ఈ యాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు నూహ్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు, పారామిలిటరీ దళాలను భారీగా మోహరించారు.
ఈ నేపథ్యంలో కాన్వాయ్లో నూహ్కు వెళ్లేందుకు ప్రయత్నించిన జగద్గురు పరమహంస ఆచార్యను సోహ్నా టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన అక్కడే బైఠాయించి నిరాహార దీక్షకు దిగారు. అల్లర్లలో హత్యకు గురైన భజరంగ్ దళ్ కార్యకర్తలకు నివాళులు అర్పించేందుకు శ్రీరామ జన్మభూమి మట్టిని, సరయూ నదిలోని జలాన్ని తీసుకొచ్చినట్టు ఆయన తెలిపారు. నూహ్లో 144 సెక్షన్ విధించడంతో తన కాన్వాయ్ను తగ్గించుకున్నట్లు చెప్పారు. అడ్డుకున్న పోలీసులు తనను అక్కడి నుంచి కదలనివ్వడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ప్రయాణాన్ని అనుమతించే వరకు అక్కడే నిరాహార దీక్ష కొనసాగిస్తానని ఆయన అన్నారు.
కాగా, జూలై 31న నూహ్లో వీహెచ్పీ చేపట్టిన జలాభిషేక యాత్రపై దాడి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన హింస, అల్లర్లలో ఇద్దరు హోంగార్డులతో సహా ఆరుగురు మరణించారు. ఈ సంఘటనతో ఆగిపోయిన యాత్రను సోమవారం నుంచి తిరిగి కొనసాగించాలని వీహెచ్పీ, భజరంగ్ దళ్ నిర్ణయించాయి. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ తమ యాత్ర కొనసాగుతుందని హిందూ సంస్థలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో నూహ్లో భద్రతా బలగాలను మోహరించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఈ పరిణామాలతో నూహ్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
#WATCH | Nuh, Haryana: Seer Jagadguru Paramhans Acharya Maharaj from Ayodhya stopped at the Sohna toll plaza by the administration.
"I have come here from Ayodhya…The administration has stopped us here, they are not allowing us to move ahead nor they are allowing us to go… pic.twitter.com/m1Dv76xkna
— ANI (@ANI) August 28, 2023