అహ్మదాబాద్ : గుజరాత్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం అమలు చేస్తున్న నైట్కర్ఫ్యూను మరో 17 పట్టణాలకు విస్తరించింది. ఇదిలా ఉండగా.. ఎనిమిది మెట్రోలు, రెండు నగరాల్లో ఆంక్షలను ఈ నెల 26 వరకు పొడిగించినట్లు సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. సురేంద్రనగర్, ధ్రాంద్ర, మోర్బి, వంకనేర్, ధోరాజి, గొండాల్, జెట్పూర్, కలవాడ్, గోద్రా, విజల్పూర్, నవ్సారి, నవ్సారి, బిలిమోరా, వ్యారా, వాపి వల్సాద్, భరూచ్, అంక్లేశ్వర్లో నైట్కర్ఫ్యూను విధించనున్నారు. శుక్రవారం సీఎం పటేల్ కొవిడ్పై సమీక్ష నిర్వహించి, మార్గదర్శకాలను ప్రకటించారు.
ఇంతకు ముందు ఈ నెల 7న ప్రభుత్వం అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, గాంధీనగర్, జునాగఢ్, జామ్నగర్, భావ్నగర్, ఆనంద్, నదియాడ్ నగరాల్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య రాత్రి కర్ఫ్యూను ప్రకటించింది. సామాజిక, మతపరమైన కార్యక్రమాల్లో 150 మందికి మించకుండా అనుమతి ఇచ్చింది. సినిమా థియేటర్లు, లైబ్రరీలు, ఆడిటోరియంలు, జిమ్లు 50శాతం ఆక్యుపెన్సీతో పని పని చేస్తాయని చెప్పింది. బస్సులను 75శాతం కెపాసిటీ నడిపేందుకు అనుమతి ఇచ్చింది. గుజరాత్లో శుక్రవారం 21,255 కొవిడ్ కేసులు నమోదవగా.. 16 మంది దుర్మరణం పాలయ్యారు.