ముంబై, ఆగస్టు 15: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. గుర్తు తెలియని ఓ వ్యక్తి గిర్గావ్లోని రిలయన్స్ ఫౌండేషన్ దవాఖానకు ఫోన్చేసి అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించినట్టు ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. సోమవారం ఉదయం దాదాపు 10.30 గంటల సమయంలో ఆ వ్యక్తి మూడు నాలుగు ఫోన్కాల్స్ చేసి అంబానీ కుటుంబాన్ని బెదిరించినట్టు తెలిపారు.
ఆ తర్వాత ముంబై నగర పోలీసులు రంగంలోకి దిగి దహిసార్ ప్రాంతంలో అనుమానితుడిని అరెస్టు చేసినట్టు వివరించారు. ఆ వ్యక్తికి మతి స్థిమితం లేనట్టు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరిలో ముకేశ్ అంబానీ నివాసం ‘అంటిలియా’ సమీపంలో పేలుడు పదార్థాలతో నింపిన ఓ ఎస్యూవీని నిలిపి ఉంచడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.