ఇద్దరు యాత్రికుల మృతి
న్యూఢిల్లీ: వాతావరణ ప్రతికూలతతో అమర్నాథ్ యాత్రను ఆదివారం తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గాం, బాల్టాల్ మార్గాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత 6,600 మంది యాత్రికులు దర్శనానికి బయలుదేరారు. మరోవైపు పలు ప్రమాద ఘటనల్లో ఇద్దరు యాత్రికులు మరణించారు. కన్వారీయ ఘటనలో ఆరుగురు మృతి యూపీలోని భవాన్పుర్ జిల్లాలో కన్వారీయ యాత్రలో జరిగిన షార్ట్సర్క్యూట్ ఘటనలో మృతుల సంఖ్య ఆదివారం ఆరుకు చేరింది.