శ్రీనగర్, జూన్ 27: మూడేండ్ల విరామం తర్వాత అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30 (గురువారం) నుంచి యాత్ర మొదలు కానున్నది. ఇందుకోసం శ్రీ అమర్నాథ్ ఆలయ బోర్డు అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు రాలేని వారి కోసం ఆన్లైన్ దర్శన ఏర్పాట్లు కూడా చేసింది. యాత్రకు వచ్చేవారు ఆధార్ కార్డు (లేదా) బయోమెట్రిక్ వివరాల ఆధారంగా జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని సూచించింది. 2019లో అర్టికల్ 370 రద్దుతో యాత్రను అర్ధంతరంగా నిలిపివేశారు. 2020, 2021లో కరోనా కారణంగా యాత్రను నిర్వహించలేదు.