న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మంచుకొండల్లో కొలువైన పరమశివుడిని దర్శించుకొనేందుకు చేపట్టే అమర్నాథ్ యాత్ర జూలై 1న ప్రారంభం కానున్నది. అయితే ఈ యాత్రలో పాల్గొనాలంటే ముందుగా పేరును నమోదు చేసుకోవాలి. ఈ నమోదు ప్రక్రియను సోమవారం జమ్ముకశ్మీర్ అధికారులు ప్రారంభించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ పేరు నమోదు చేసుకోవచ్చు. గర్భిణులు యాత్రలో పాల్గొనడానికి అనుమతి లేదు.