న్యూఢిల్లీ, అక్టోబర్ 1: పంజాబ్ మాజీ సీఎం అమరిందర్సింగ్ కొత్త పార్టీ స్థాపించబోతున్నారన్న వార్తలకు మరింత బలం చేకూరింది. తన కొత్త పార్టీకి ‘పంజాబ్ వికాస్ పార్టీ’ అని పేరు ఖరారు చేసినట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీకి కూడా ఆయన రంగం సిద్ధం చేసుకొంటున్నారు. రైతు సంఘాల నేతలు, రాష్ట్రంలో చిన్న పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. అంతకంటే ముందు అమరిందర్ తన సన్నిహితులు, సిద్ధూ వ్యతిరేకులతో భేటీ నిర్వహించి పార్టీ విధివిధానాలను ప్రకటిస్తారని తెలుస్తున్నది.