చంఢీఘడ్: పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్కు కరోనా వైరస్ సంక్రమించింది. కోవిడ్ పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు ఆయన ఇవాళ తన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నానని, తనతో కాంటాక్ట్లోకి వచ్చినవాళ్లు తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. 79 ఏళ్ల అమరీందర్ ఇటీవల పంజాబ్ లోక్ కాంగ్రెస పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అమరీందర్ భార్య, పాటియాల ఎంపీ ప్రణీత్ కౌర్ కూడా కోవిడ్ పరీక్షలో పాజిటివ్ తేలారు.