న్యూఢిల్లీ: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. అదే రోజున సాధారణ బడ్జెట్తో పాటు రైల్వే బడ్జెట్ను ప్రవేశపెడుతారు. అయితే ఈ సారి రైల్వేశాఖ బడ్జెట్ను రెండింతలు చేయనున్నట్లు తెలుస్తోంది. రైల్వే కేటాయింపులు 15 నుంచి 20 శాతం వరకు పెరిగే ఛాన్సుంది. గత ఏడాది 1,10,055 కోట్లను రైల్వే బడ్జెట్లో కేటాయించారు. ఈసారి ఆ మొత్తం 2.5 లక్షల కోట్లు ఉండేలా అవకాశాలు ఉన్నాయి. రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయాలకు సంబంధించిన ప్రకటన వెలుబడనున్నది. గత ఏడాది రైల్వేకు 26,338 కోట్ల నష్టం వాటిల్లింది. రైల్వే టికెట్ ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. అల్యూమినియంతో తయారైన పది కొత్త లైట్ ట్రైన్లను బడ్జెట్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసి మధ్య బుల్లెట్ రైలును కూడా ప్రకటించనున్నారు. డీజిల్, విద్యుత్తు భారాన్ని తగ్గించేందుకు.. సౌర విద్యుత్తు ఉత్పత్తిపై రైల్వేశాఖ దృష్టి పెట్టనున్నది. 2030 నాటికి వంద శాతం రైల్వే విద్యుద్దీకరణ జరగనున్నది. టూరిస్టు ప్రాంతాలను కలిపే కొత్త రైళ్లను ప్రకటించనున్నారు.