న్యూఢిల్లీ: ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ బాధితురాలిని ఊరేగించారు. ఆమె వెంట్రుకలను కత్తిరించింది.. ముఖానికి నల్లటి రంగు రుద్ది.. వీధుల్లో కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి ఇప్పటికే నలుగురు మహిళలను అరెస్టు చేశారు. ఈస్ట్ ఢిల్లీలోని షాదారాలో ఈ ఘటన జరిగింది. వ్యక్తిగత కక్ష వల్లనే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన పట్ల విచారణ ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు. వ్యక్తిగత కక్ష వల్ల ఓ మహిళపై దురదృష్టవశాత్తు లైంగిక దాడి జరిగిందని, బాధితురాలి కుటుంబానికి సహకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 20 ఏళ్ల వయసు ఉన్న ఆ మహిళను అక్రమ మద్యం అమ్మేవాళ్లు గ్యాంగ్ రేప్ చేసినట్లు డీసీడబ్ల్యూ చైర్మెన్ స్వాతి మాలివాల్ ఆరోపించారు. కస్తూర్బా నగర్లో ఆ మహిళను కొట్టుకుంటూ ఊరేగిస్తున్న వీడియో ఆమె తన ట్విట్టర్లో పోస్టు చేసింది. ఈ దాడికి పాల్పడిన మహిళల్ని కూడా అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది.