ప్రయాగ్రాజ్: మతంతో సంబంధం లేకుండా మేజర్లు తమ జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే హక్కు ఉన్నట్లు అలహాబాద్ హైకోర్టు తన తీర్పులో పేర్కొన్నది. జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా, దీపక్ వర్మలతో కూడిన ధర్మాసనం ఓ కేసులో తీర్పునిస్తూ.. భిన్న మతాలకు చెందిన జంటకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. ఆ ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న రిలేషన్షిప్ను వారి తల్లితండ్రులు కూడా అడ్డుకోరాదు అని కోర్టు తెలిపింది. కలిసిగా జీవిస్తున్న ఇద్దరు మేజర్లు దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీర్పునిస్తూ.. ఆ జంట ప్రేమలో ఉందని, అందుకే వారిని ఎవ్వరూ అడ్డుకోలేరని, వాళ్ల పేరెంట్స్ కూడా అడ్డుకోరాదు అని కోర్టు చెప్పింది. ఆ జంటకు ఎటువంటి హాని కలగకుండా చర్యలు చేపట్టాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
షిఫా హసన్తో పాటు ఆమె భాగస్వామి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము ప్రేమలో ఉన్నామని, ఇష్టపూర్వకంగానే కలిసి జీవిస్తున్నట్లు ఇద్దరూ ఆ పిటిషన్లో తెలిపారు. ఇద్దరివీ భిన్న మతాలని, హసన్ది ముస్లిం మతమని, ఇక అమ్మాయి హిందూ వర్గానికి చెందినట్లు చెప్పారు. ముస్లిం మతం నుంచి హిందూ మతానికి మారుతున్నట్లు తన భాగస్వామి పిటిషన్ కూడా వేసినట్లు హసన్ తెలిపాడు. అయితే తల్లితండ్రులు మాత్రం ఆ జంట పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఆ యువ జంట రక్షణ కోసం కోర్టును ఆశ్రయించింది.