న్యూఢిల్లీ: దేశంలో ఔషధ విక్రయాల అవకతవకలు నివారించి, సరైన మందులు వినియోగదారులకు అందేలా చూసేందుకు భారత ఔషధ నియంత్రణ సంస్థ కఠిన నియమాలను అమలు చేయనుంది. ఇక నుంచి ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) లేకుండా రిటైల్ ఫార్మసీలు ఎలాంటి ఔషధాలు అమ్మరాదని, అర్హులైన ఫార్మసిస్టులు తప్పనిసరిగా ఉండాలని, వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే అమ్మకాలు సాగించాలని ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాలకు లేఖ రాసింది.
ఫార్మాసిస్టులు మందుల చీటీ రాసేందుకు అనుమతించాలన్న ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనకు జాతీయ వైద్య కమిషన్ అంగీకారం తెలుపలేదు. రోగులను పరీక్షించి, చికిత్స అందించడంపైనే మందుల చీటీ రాయడం ఆధారపడి ఉంటుందని తెలిపింది.