Maharashtra | ముంబై, మార్చి 31(నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని చంద్రాపూర్లో అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్ ఇచ్చిన హామీ ఆసక్తి రేపుతున్నది. తాను ఎంపీగా గెలిస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి చౌక ధరల దుకాణాల నుంచి రేషన్తో పాటు విస్కీ, బీరును అందించనున్నట్టు ఆమె ప్రకటించారు. దీనితో పాటు, నిరుద్యోగ యువకులకు మద్యం లైసెన్సులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.