Coal India | న్యూఢిల్లీ : ఇటీవల కుదిరిన వేతన సవరణ ఒప్పందం నేపథ్యంలో నాన్ ఎగ్జిక్యూటివ్స్తో పోల్చితే తమ వేతనాలు తక్కువ ఉంటున్నాయని కోల్ ఇండియా ఎగ్జిక్యూటివ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను సెప్టెంబర్ 30 కల్లా పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ కోల్ ఎగ్జిక్యూటివ్స్ (ఏఐఏసీఈ) ఆదివారం కోల్ ఇండియా చైర్మన్కు లేఖ రాసింది.
పర్సనల్ పే ప్యాకేజీ ద్వారా వేతన భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. కోల్ ఇండియా నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల బేసిక్, వీడీఏ, స్పెషల్ డీఏలో కనీసం 19 శాతం, ఇతర అలవెన్స్లలో 25 శాతం పెంపుపై వేతన సవరణకు బొగ్గు గనుల శాఖ ఆమోదముద్ర వేసింది.