జైపూర్: రాజస్థాన్లో కాంగ్రెస్ హవా కొనసాగుతున్నది. రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దించిన ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ నేతలు ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీ, బీజేపీకి చెందిన ఘనశ్యామ్ తివారీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ముకుల్ వాస్నిక్కి 42, ప్రమోద్ తివారీకి 41, రణ్దీప్ సూర్జేవాలాకు 43, ఘనశ్యామ్ తివారీకి 43 ఓట్లు పొలయ్యాయి. రాజస్థాన్లోని 200 అసెంబ్లీ స్థానాలకుగాను కాంగ్రెస్కు 108, బీజేపీకి 71 సంఖ్యా బలమున్నది.
కాగా, బీజేపీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి, మీడియా అధినేత సుభాష్ చంద్ర రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనకు ఓటు వేస్తారని తొలుత ఆయన ప్రకటించారు. డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ను క్రాస్ ఓటు వేయాలని ఆయన కోరారు.
మరోవైపు రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ముకుల్ వాస్నిక్, రణ్దీప్ సూర్జేవాలా, ప్రమోద్ తివారీని సీఎం అశోక్ గెహ్లాట్ అభినందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ఆయన అభివర్ణించారు.