హర్దోయ్: వంతెన పైనుంచి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిన ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిన్న ప్రమాదం జరిగినప్పటి నుంచి 15 గంటలపాటు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు మొత్తం 8 మృతదేహాలను వెలికి తీశారు. అనంతరం ఇంకా ఎవరూ గల్లంతైనట్లు సమాచారం లేకపోవడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.
శనివారం ఉదయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హర్దోయ్ జిల్లాలో 22 మంది రైతులు తాము పండించిన దోసకాయలను ట్రాక్టర్ ట్రాలీలో సమీప మార్కెట్కు తీసుకెళ్లి వాటిని అమ్మిన అనంతరం ఇళ్లకు తిరుగు పయనమయ్యారు. సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో పాలీ పట్టణం సమీపంలో ట్రాక్టర్ ట్రాలీ టైర్ ఊడిపోవడంతో.. ట్రాక్టర్ అదపుతప్పి వంతెన పైనుంచి గర్రా నదిలో పడిపోయింది.
ప్రమాదం జరిగిన వెంటనే 14 మంది రైతులు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మిగిలిన 8 మంది గల్లంతయ్యారు. ఇవాళ నది నుంచి ఆ ఎనిమిది మంది మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టానికి పంపించారు. మృతుల కుటుంబాలకు హర్దోయ్ జిల్లా మెజిస్ట్రేట్ రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.