రాయ్పూర్ : చెడుపై మంచి సాధించిన దానికి ప్రతీకగా దసరా రోజు.. రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఛత్తీస్గఢ్లోని ధంతరిలో కూడా రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ధంతరిలోని రాంలీలా మైదానంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. కానీ ఆ దిష్టిబొమ్మకు ఏర్పాటు చేసిన రావణుడి 10 తలలు తగలబడలేదు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. దిష్టిబొమ్మను ఏర్పాటు చేసిన క్లర్క్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు. మరో నలుగురు అధికారులకు ధంతరి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. రావణుడి తలలు తగలబడకపోవడానికి గల కారణాలను రాతపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది.
గ్రేడ్ -3 క్లర్క్ యాదవ్ నిర్లక్ష్యం కారణంగానే రావణాసురుడి తలలు తగలబడలేదని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక దిష్టిబొమ్మను తయారు చేయడానికి అయిన ఖర్చును కూడా అధికారులు ఇవ్వలేదు.