Alcohol Party : చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ కే. సుధాకర్ లోక్సభ ఎన్నికల్లో తన గెలుపు సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన విందులో బాహాటంగా మద్యం పంపిణీ చేయడం కలకలం రేపింది. పార్టీలో మద్యం తీసుకునేందుకు ప్రజలు క్యూలో నిలుచున్న వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. విజయోత్సవ సభలో మద్యం పంపకాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇది పోలీసుల వైఫల్యమని పలువురు ఆరోపిస్తుండగా ఈ ఘటనపై బెంగళూర్ రూరల్ ఎస్పీ సీకే బాబా స్పందించారు. ఎక్సైజ్ శాఖ ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చిందని, ఏర్పాట్లను సజావుగా చేపట్టాలని పోలీసులను కోరారని చెప్పారు. ఈ ఘటన విషయంలో పోలీస్ శాఖ తప్పు లేదని, అనుమతి ఇచ్చే బాధ్యత ఎక్సైజ్ శాఖదేనని స్పష్టం చేశారు.
#WATCH | Nelamangala, Karnataka: People queue up to receive their bottle of alcohol at the party organised by Chikkaballapur BJP MP K Sudhakar in celebration of his Lok Sabha win from the constituency
Bengaluru Rural SP CK Baba says, “The excise department gave permission and… pic.twitter.com/Wu0W9uSNl0
— ANI (@ANI) July 8, 2024
బీజేపీ నేత మద్యం పంపిణీకి ఎక్సైజ్ శాఖ అనుమతి ఇస్తే, పోలీసులు శాంతిభద్రతలను కాపాడుతూ పహారా కాశారని ఈ ఘటనపై పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం బీజేపీ నేతలను థ్యాంక్స్ గివింగ్ పార్టీలకు అనుమతించారా అని ప్రశ్నిస్తున్నారు. మద్యం పంపిణీని అడ్డుకోవాల్సిన ఎక్సైజ్ సిబ్బంది, పోలీసులు దగ్గరుండి మరీ ఈ తంతును నిర్వహించడమేంటని విరుచుకుపడుతున్నారు.
Read More :
Corporations | టీఎస్ఐఐసీ చైర్పర్సన్గా నిర్మలా జగ్గారెడ్డి..