పథనంతిట్ట, నవంబర్ 10: శబరిమలలోని అయ్యప్ప ఆలయం పరిసరాలు, చుట్టు పక్క గ్రామాలలో మద్య నిషేధం విధిస్తూ కేరళ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నెల 17 నుంచి రెండు నెలలపాటు కొనసాగే మండలం-మకరవిలక్కు ఉత్సవాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘సన్నిధానం (ఆలయం ఆవరణ), పంబ, త్రివేణి, మరకూట్టం, శబరిపీడంతోపాటు పెరినాడు, కొల్లముల గ్రామాల్లో నిషేధం అమలులో ఉంటుందని తెలిపింది. ఈ నెల 14 నుంచి జనవరి 22 వరకు మద్యం వినియోగం, అమ్మకాలు, మత్తుపదార్థాలు, పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. శబరిమలకు వచ్చే యాత్రికులందరూ ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని సూచించింది.