సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తన మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్దళ్కి షాకిచ్చారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఆర్ఎల్డీ అధ్యక్షుడు జయంత్ చౌదరీని రాజ్యసభకు నామినేట్ చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ.. అఖిలేశ్ ఇప్పుడు దీనిని అమలు పరచడంలో వెనకంజ వేశారు. ఇప్పటికే ఇద్దర్నీ రాజ్యసభకు నామినేట్ చేసేశారు. ఒకరు కపిల్ సిబల్, రెండో నేత జావేదీ అలీఖాన్. మూడో స్థానంలో జయంత్ చౌదరి ఉంటారని అందరూ భావించారు. కానీ.. అఖిలేశ్ ఆయన భార్య డింపుల్ యాదవ్కు ఇవ్వనున్నట్లు సమాచారం.
మూడో రాజ్యసభ స్థానానికి డింపుల్ యాదవ్ పేరు దాదాపుగా ఖరారైపోయినట్లు అఖిలేశ్ సన్నిహితులు పేర్కొంటున్నారు. తనను రాజ్యసభకు నామినేట్ చేస్తానని అఖిలేశ్ జయంత్ చౌదరీకి హామీ ఇచ్చారు. ఇలా సమాజ్వాదీ పక్షాన రాజ్యసభలో అడుగు పెట్టాలని జయంత్ కూడా ఎన్నో కలలు కన్నారు. చివరికి ఇది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
నిజానికి కపిల్ సిబల్ స్థానంలో జయంత్ చౌదరీని పంపాలన్న ప్రతిపాదన ఉందన్నది పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే… సమాజ్వాదీ సీనియర్ నేత ఆజంఖాన్ విడుదలలో న్యాయవాదిగా కపిల్ సిబల్ కీలక పాత్ర పోషించారు. దీంతో కపిల్ సిబల్ను రాజ్యసభకు పంపాలని ఆజంఖాన్ పార్టీ చీఫ్ అఖిలేశ్పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారని, ఇందుకు అఖిలేశ్ తలొగ్గారని తెలుస్తోంది.