Akhilesh on Mamata | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ రాజకీయ కూటమిలో చేరేందుకు సిద్ధం అని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. వచ్చే ఏడాది జరిగే యూపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఝాన్సీలో యాత్ర నిర్వహిస్తున్న అఖిలేశ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో మమతాబెనర్జీ చేతిలో ఓటమి పాలైనట్లే యూపీలోనూ కాంగ్రెస్ పార్టీ తుడిచి పెట్టుకు పోతుందని చెప్పారు.
మమతా బెనర్జీని స్వాగతిస్తున్నాం. బెంగాల్లో బీజేపీని తుడిచిపెట్టేసినట్లే యూపీలోనూ ప్రజలు ఆ పార్టీని తుడిచి పెడతారన్నారు. కూటమి ఏర్పాటుపై సరైన సమయంలో స్పందిస్తానని ఓ ప్రశ్నకు సమాధానంగా అన్నారు.కాంగ్రెస్ పార్టీ కూడా తుడిచిపెట్టుకుపోతుందని అఖిలేశ్ యాదవ్ జోస్యం చెప్పారు.. ప్రజలు వారిని తిరస్కరిస్తారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు అని ప్రియాంక గాంధీనుద్దేశించి అన్నారు.
గురువారం మొరాదాబాద్లో ప్రియాంకగాంధీ మాట్లాడుతూ లఖింపూర్ ఖేరీ ఘటనలో బాధితులను పరామర్శించడానికి ఎందుకు రాలేదని అఖిలేశ్ యాదవ్ను ప్రశ్నించారు. 2017 ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేసినా సత్ఫలితాలు సాధించలేదు.