యూపీ ఎన్నికలు ముంగిట్లో ఉండగా… మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్కు భారత అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా చరణ్ సింగ్కు నివాళులర్పిస్తూ.. ట్విట్టర్ వేదికగా ఈ సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ”ఆదరణీయ చరణ్ సింగ్ జయంతిని పురస్కరించుకొని, ఆయన్ను మరోసారి గుర్తు చేసుకుంటున్నాను. నేడు రైతు దినోత్సవం. రైతుల కోసం తన సర్వస్వాన్ని అర్పించిన చరణ్ సింగ్కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని కోరుతున్నాను” అంటూ అఖిలేశ్ డిమాండ్ చేశారు.