తాము అధికారంలోకి వస్తే నిరంతరాయంగా, చౌకగా విద్యుత్ను సరఫరా చేస్తామని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. వ్యవసాయం, గృహ, కర్మాగారాలకు చౌకగా, నిరంతరాయంగా సరఫరా చేస్తామని ట్విట్టర్ వేదికగా హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం విద్యుత్పై అంతగా దృష్టి సారించలేదని ఈ సందర్భంగా విమర్శించారు. ఈఠ్తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ పవర్ ప్లాంట్లను నిర్మించి వుంటే, అత్యధిక రేటుకు కరెంట్ను కొని ఉండాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు ఉండేది కాదన్నారు. తాము అధికారంలోకి వస్తే మాత్రం చౌకగా, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. మరోవైపు కాన్పూర్ వ్యాపారి పీయూశ్ జైన్ ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడంపై కూడా అఖిలేశ్ స్పందించారు. ఈ రైడ్స్కు, పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని, అలాగే పార్టీ ఎమ్మెల్సీ పమ్మి జైన్కు కూడా పీయూశ్ జైన్తో సంబంధం లేదని అఖిలేశ్ స్పష్టం చేశారు.