లక్నో : యూపీలోని ప్రయాగరాజ్లో అఖిల భారత అఖాడ పరిషత్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మహరాజ్ అనుమానాస్పద స్థితిలో సీలింగ్కు వేలాడుతూ విగతజీవిగా కనిపించడం కలకలం రేగింది. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించడంతో స్వామీజీ మరణాన్ని ఆత్మహత్య కేసుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
72 ఏండ్ల స్వామీజీ ఈ ఏడాది ఏప్రిల్లో కొవిడ్-19 ఇన్ఫెక్షన్కు గురయ్యారు. అప్పట్లో ఆశ్రమం లోపలే ఆయన ఐసోలేషన్లో ఉన్నారు. నరేంద్ర గిరి మహరాజ్ మరణం పట్ల యూపీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సంతాపం ప్రకటించారు.