న్యూఢిల్లీ: అజిత్ పవార్ విమాన దుర్ఘటనపై పవార్ కుటుంబ సభ్యుడు, శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యే రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 28 నాటి విమాన దుర్ఘటనలో అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోవటం వెనుక 100 శాతం కుట్ర దాగివుందని రోహిత్ పవార్ అనుమానాలు వ్యక్తం చేశారు. మంగళవారం ముంబైలో రోహిత్ పవార్ విలేకర్లతో మాట్లాడుతూ, ‘విమాన దుర్ఘటన వెనుక 100శాతం కుట్ర దాగివుంది. పార్టీ సీనియర్ నాయకులకు విమాన ప్రమాద ఘటన, దాని దర్యాప్తు ముఖ్యం కాదు. అధికారంలో కొనసాగటమే వారికి ముఖ్యం’ అని ఆయన అన్నారు. ఆ రోజు విమాన ప్రయాణం కోసం ఇద్దరు పైలట్లను నియమించారని, చివరి నిమిషంలో పైలట్ సుమిత్ కపూర్కు బాధ్యతలు అప్పగించటాన్ని రోహిత్ తప్పుబట్టారు.