Ajit Pawar | ముంబై, జనవరి 7: ఎన్సీపీ వ్యవస్థాపకుడు, తన పెద్దనాన్న శరద్ పవార్పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవార్ వయసు గురించి ప్రస్తావిస్తూ కొందరు వ్యక్తులు 80వ పడిలో ఉన్నా కూడా తమ పదవుల నుంచి రిటైర్ కారంటూ విమర్శించారు. ‘58 ఏండ్లు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారు.
చాలామంది 75 ఏండ్ల వయసు రాగానే తమ వృత్తి జీవితానికి స్వస్తి పలుకుతారు. కానీ కొంతమంది (శరద్ పవార్ను ఉద్దేశించి) 80 ఏండ్లు దాటి 84కు వచ్చినా రిటైరవ్వడానికి సిద్ధపడటం లేదు’ అని థాణేలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో అజిత్ పవార్ విమర్శించారు.