జైపూర్: రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో ఓ గమ్మత్తు ఘటన జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్ అరుణ్ బోత్రా విమానం ఎక్కేందుకు ఎయిర్పోర్ట్ వెళ్లారు. ఆ సమయంలో అతని బ్యాగ్ను ఓపెన్ చేయమని అక్కడి సెక్యూర్టీ అడిగింది. అయితే ఆ బ్యాగ్ను ఓపెన్ చేశాక.. డ్యూటీలో ఉన్న సిబ్బంది అంతా షాక్ అయ్యారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా ఆ ఆఫీసర్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు. ఒడిశాలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా చేస్తున్న అరుణ్ బోత్రా ఎయిర్పోర్ట్కు ఓ బ్యాగ్తో వెళ్లారు. అక్కడి సెక్యూర్టీ బ్యాగ్ను తెరవమని అడగ్గా.. ఆయన దాన్ని ఓపెన్ చేశారు. అయితే బ్యాగ్లో పచ్చి బఠాణీలు ఉన్నాయి. గ్రీన్ పీస్తో నిండిన బ్యాగ్ను చూసి సెక్యూర్టీ స్టన్ అయ్యింది. బఠాణీలతో నిండి ఉన్న బ్యాగ్ ఫోటోను ఆయన తన ట్విట్టర్లో పెట్టారు. కేజీకి రూ.40 చొప్పున ఆ ఆఫీసర్ బఠాణీలు కొన్నారట. నిజానికి బఠాణీల బ్యాగ్తో బోత్ర వెళ్లారో లేదో తెలియదు. కానీ ఆయన పోస్టు చేసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోకు 48 వేల లైక్లు వచ్చాయి. ఇక నెటిజెన్లు కూడా రకరకాల కామెంట్లతో కేక పుట్టిస్తున్నారు.
Security staff at Jaipur airport asked to open my handbag 😐 pic.twitter.com/kxJUB5S3HZ
— Arun Bothra 🇮🇳 (@arunbothra) March 16, 2022