న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతున్నది. దీపావళి సందర్భంగా ప్రభుత్వం పటాకులపై నిషేధం విధించింది. అయినప్పటికీ ప్రజలు లెక్కచేయకుండా పెద్దమొత్తంలో బాంబులను కాల్చడంతో వాయుకాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీంతో వాయు నాణ్యత దారుణంగా పడిపోతున్నది. శనివారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 309గా నమోదైంది. నగరంలో మథురా రోడ్డు, బారఖాంబా రోడ్డు, ప్రగతి మైదాన్ వద్ద కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉన్నది.
కాలుష్యం పెరిగిపోవడంతో కొన్నిసార్లు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుందని సుఖ్దేవ్ అనే రిక్షా కార్మికుడు తెలిపారు. గాలిలో మార్పును మన కళ్లలో కూడా చూడవచ్చని చెప్పారు. అయినా ఇంట్లోనుంచి బయటికి వెళ్లక తప్పదన్నారు.
Air quality dips in Delhi with overall AQI being 309 (very poor) this morning; visuals from Mathura Road, Barakhamba Road & Pragati Maidan
A cart puller, Sukhdev says,"Stepping out of home is a necessity.Breathing gets difficult sometimes,you can feel change in air even in eyes" pic.twitter.com/CAixCoZbfM
— ANI (@ANI) October 29, 2022
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.