న్యూఢిల్లీ 16: తనతో పాటు ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా అధికారిని ఓ ప్రయాణికుడు చెంపదెబ్బ కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 9న సిడ్నీ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రయాణికుడు గట్టిగా అరుస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించాడు. ఎయిర్ ఇండియా అధికారి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా, సదరు ప్రయాణికుడు ఆగ్రహంతో అధికారిని చెంపదెబ్బ కొట్టి దూషించాడు.