న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా (Air India) తన క్యాబిన్ సిబ్బంది, పైలట్లకు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన యూనిఫాంల న్యూ కలెక్షన్ను మంగళవారం విడుదల చేసింది. ఎయిర్లైన్ క్యాబిన్ సిబ్బంది సంప్రదాయం, ఆధునికత ఉట్టిపడే శారీల్లో మెరవనున్నారు. ఎయిర్ ఇండియా తొలి ఎయిర్బస్ ఏ350 ఎంట్రీ నుంచి రానున్న కొద్దినెలల్లో దశలవారీగా నూతన యూనిఫామ్స్ను ప్రవేశపెట్టనున్నారు.
మహిళా సిబ్బంది సౌకర్యవంతంగా ఉండే బ్లౌజ్, బ్లేజర్తో ఎయిర్ ఇండియా లోగో ఐకాన్తో కూడిన రెడీ టూ వేర్ శారీలను ధరిస్తారు. సౌకర్యవంతంగా ఉండటంతో పాటు ఆధునికత, సంప్రదాయాన్ని మేళవించేలా ఈ నూతన యూనిఫాం ఆకట్టుకుంటుందని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
కాక్పిట్ సిబ్బంది క్లాసిక్ బ్లాక్ డబుల్ బ్రెస్టెడ్ సూట్తో కనిపిస్తారు. దేశ భిన్న సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ మోడ్రన్ లుక్తో వీటిని డిజైన్ చేశానని మనీష్ మల్హోత్రా చెప్పుకొచ్చారు. ఎయిర్ ఇండియా యూనిఫాంలు డిజైన్ చేసే అవకాశం తనకు లభించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.
Read More :
Virushka | కోహ్లీ దంపతుల ఆరో వివాహ వార్షికోత్సవ వేడుక.. సెలబ్రేషన్ ఫొటోలు వైరల్